Friday, September 4, 2009

YSR DEAD, TAKEN T PULIVENDULA, FANS ATTEMPTING SUICIDES


హైదరాబాద్ : కోట్లాది మంది జనహృదయాలను దోచుకున్న నాయకుడు, చిరునవ్వుల రారాజు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మృతి 122 తెలుగువారి గుండెలను ఆపివేసింది. హెలికాప్టర్ ప్రమాదంలో తమ ప్రియతమ నాయకుడు వైఎస్ దుర్మరణం పాలయ్యారన్న వార్త విని తట్టుకోలేక రాష్ట్రంలో శుక్రవారం ఉదయానికి 99 మంది గుండె ఆగి మరణించారు. మరో 23 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో అత్యధికంగా వరంగల్ జిల్లాలో 14 మంది ప్రాణాలు కోల్పోగా, తూర్పు గోదావరి జిల్లాలో ఆ తరువాతి స్థానంలో 8 మంది మరణించినట్లు శుక్రవారం మధ్యాహ్నం వరకూ అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

జనహితం కోరే తమ ముఖ్యమంత్రి దారుణమైన పరిస్థితుల్లో మరణించిన తీరును టెలివిజన్లలో చూసి గురువారం నాడే అనేక మంది గుండెపోటుతో మరణించారు. ఆత్మహత్య చేసుకున్న వారిలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు వృద్ధులు, పేదలే ఎక్కువగా ఉండడం గమనార్హం. గుండె పోటుతో మరణించిన వారిలో మహిళలు అధికంగా ఉన్నారని ఇంతవరకూ అందిన సమాచారం. కర్నూలు సమీపంలోని హెలికాప్టర్ కూలిపోయిన ప్రదేశాలను, అక్కడ వైఎస్ మృతదేహం పడిన తీరును టెలివిజన్లలో చూసిన వారు ఆ దృశ్యాలను తట్టుకోలేకపోయారు. టీవీల్లో మరణవార్త వినగానే పలువురు నిలువునా కుప్పకూలిపోయారు.

No comments:

Post a Comment